మల్యాలలో సందడి చేసిన సింగర్ శిరీష
NEWS Nov 01,2024 01:17 pm
మల్యాల మండల కేంద్రంలో సింగర్ శిరీష సందడి చేశారు. మల్యాల మాజీ ఎంపీపీ రవళివంశీధర్ ఆహ్వానం మేరకు విచ్చేసిన ఆమె మాట్లాడుతూ... షూటింగ్ లో భాగంగా ఇక్కడికి వచ్చానని, మీ ప్రేమ ఆదరాభిమానాలు ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. శిరీష ను చూడడానికి అభిమానులు పెద్ద ఎత్తున వచ్చి సెల్ఫీలు దిగారు. ఇక్కడ వంశీ, నరేష్ చిన్ను, నవతేజ్, రమేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.