విజేతలకు బహుమతులు అందించిన DSP
NEWS Nov 01,2024 01:24 pm
జగిత్యాల జిల్లా కేంద్రంలో శుక్రవారం జరిగిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి అండర్ 14, 17 SFG టేబుల్ టెన్నిస్ పోటీలు. పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు జగిత్యాల DSP రఘు చందర్. ఈ సందర్భంగా DSP మాట్లాడుతూ.. విద్యార్థులు గెలుపోటములను సమానంగా తీసుకోవాలని, మున్ముందు జరిగే పోటీలలో గెలుపే లక్ష్యంగా శిక్షణ తీసుకోవాలని సూచించారు. గెలుపొందిన విద్యార్థులు రాష్ట్రస్థాయిలో జిల్లాకు పేరు తీసుకురావాలన్నారు.