వైసీపీ నేతలకు పవన్ వార్నింగ్
NEWS Nov 01,2024 12:46 pm
వైసీపీ చేసిన తప్పుడు విధానాలు, దోపిడీ వల్ల ఇబ్బందులు పడుతున్నామన్నారు Dy CM పవన్ కల్యాణ్. చింత చచ్చినా పులుపు చావడం లేదన్నట్లు ఇంత ఓడినా వారి నోరు ఆగట్లేదని ధ్వజమెత్తారు. మీ నోటి వెంట మరేమీ రాకుండా మీ భవిష్యత్తు సెట్ చేస్తానని పవన్ వార్నింగ్ ఇచ్చారు. నేను త్రికరణ శుద్ధితో పని చేస్తానన్న పవన్.. ఆఫీసులో కూర్చుని ఇష్టానికి మాట్లాడితే మీ సంగతి చూస్తానని హెచ్చరించారు. తొక్కి నార తీస్తా, చూస్తూ ఉండమన్నారు.