బీసీ కమిషన్ చైర్మన్ను కలిసిన
ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ
NEWS Nov 01,2024 11:10 am
ఉమ్మడి కరీంనగర్ జిల్లా పర్యటనలో ఉన్న రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ జి.నిరంజన్ని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా సామాజికంగా, ఆర్థికంగా వెనకబాటుతనానికి గురవుతున్న బలహీన వర్గాలకు (బిసి) రాజ్యాంగ బద్ధంగా స్థానిక సంస్థల ఎన్నికలలో, ఇతర విద్యా, ఉద్యోగ, ఆర్థిక సంక్షేమ కార్యక్రమాల్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరారు.