మెట్పల్లి: గడ్డం లక్ష్మారెడ్డికి నివాళులు
NEWS Nov 01,2024 11:12 am
మెట్పల్లి మండలం మేడిపల్లి గ్రామ మాజీ సర్పంచ్ గడ్డం లక్ష్మారెడ్డి వర్థంతి వేడుకలను శుక్రవారం నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. గ్రామంలో హైస్కూల్, రోడ్ల నిర్మాణానికి, గ్రామ అభివృద్ధికి ఆయన చేసిన కృషిని కొనియాడారు. కార్యక్రమంలో నాయకులు పీసు రాజేందర్ రెడ్డి, గడ్డం శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.