హామీలు నెరవేర్చేదాక పోరాటం ఆగదు
NEWS Nov 01,2024 11:20 am
భీంగల్: కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీల హామీలను నెరవేర్చేదాక తమ పోరాటం ఆగదని బీఆర్ఎస్ భీంగల్ మండలాధ్యక్షుడు దొనకంటి నర్సయ్య అన్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయక రైతులు ధాన్యాన్ని దళారులకు తక్కువ ధరకు అమ్ముకుని నష్టపోతున్నరన్నారు. ఈ సమావేశంలో మాజీ జెడ్పీటీసీ చౌటుపల్లి రవి, మోహిద్, శర్మా నాయక్, నర్సయ్య, ప్రసాద్, నాయకులు రాము, నీలం రవి, దశగౌడ్, తుక్కాజీ తదితరులు పాల్గొన్నారు.