స్కూల్లో వాటర్ ప్లాంట్ ప్రారంభించిన MP
NEWS Nov 01,2024 09:47 am
పొద్దుటూరు పట్టణంలోని సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో మినరల్ వాటర్ ప్లాంట్ను అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ నాయుడు ప్రారంభించారు. ఇటీవల ఎన్నికల్లో ఎంపీగా గెలిచినా అనంతరం తాను చదువుకున్న స్కూల్లో ఎంపీ సీఎం రమేష్ నాయుడు పర్యటించారు. పాఠశాల యాజమాన్యం వాటర్ ప్లాంట్ కోసం విన్నవించిన మేరకు స్పందించిన ఎంపీ తన సొంత నిధులతో వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు.