పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోండి.. జైపాల్ నాయక్
NEWS Nov 01,2024 09:49 am
మెదక్: పట్టభద్రులగా ఉన్నవారు తమ ఓటును నమోదు చేసుకోవాలని గిరిజన సంక్షేమ సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు జైపాల్ నాయక్ తెలిపారు. 2021లోపు డిగ్రీ పూర్తి చేసిన వారు ఫారం 18ను నింపాలని, ఆన్ లైన్లో నమోదు చేసుకోవాలని కోరారు. www.ceotelangana.nic.in లో తమ వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. మెదక్ ఉమ్మడి జిల్లాని పట్టభద్రులు నమోదు చేసుకోవాలన్నారు. గతంలో ఓటు ఉన్నవారు కూడా తిరిగి తమ ఓటును నమోదు చేసుకోవాలని కోరారు.