పవన్ కళ్యాణ్ పర్యటనలో స్వల్ప మార్పు
NEWS Nov 01,2024 08:33 am
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏలూరు జిల్లా పర్యటనలో స్వల్ప మార్పులు జరిగాయి. రాజమహేంద్రవరం విమానాశ్రయం నుంచి ఐఎస్ జగన్నాథపురానికి బయలుదేరారు. గ్రామంలోని శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకోనున్నారు. దర్శనం అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సభకు హాజరు కానున్నారు. ఆ తర్వాత లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయనున్నారు.