ఓటు నమోదు చేసుకోవాలి: తపస్
NEWS Nov 01,2024 07:09 am
టేక్మాల్: తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో టేక్మల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఓటు నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి తపస్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయులందరూ ఓటు నమోదు చేసుకోవాలని, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు చాలా విలువైందన్నారు. ఈ కార్యక్రమంలో తపస్ జిల్లా నాయకులు నర్సింలు, దుర్గ ప్రసాద్, తులసిరామ్, ప్రసాద్ రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.