పాలకొండ: ఈతకు వెళ్లి విద్యార్థి మృతి
NEWS Nov 01,2024 07:11 am
కడప: ఈత కొట్టేందుకు వెళ్లి విద్యార్థి మృతి చెందిన ఘటన పాలకొండలలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. గురువారం తోటి స్నేహితులతో కలిసి మృత్యుంజయకుంటకు చెందిన మనోజ్ పాలకొండలకు వెళ్ళాడు. ప్రమాదవశాత్తు పాలకొండల పైనుంచి జారిపడి గుండంలో చిక్కుకున్నాడు. విషయం తెలుసుకున్న రిమ్స్ పోలీసులు శ్రమించి గుండంలో చిక్కుకున్న మనోజ్ మృతదేహాన్ని బయటకు తీశారు.