పుష్ప.. తరహాలో గంజాయి స్మగ్లింగ్
NEWS Oct 31,2024 05:51 pm
కుమురం భీం జిల్లా వాంకిడి అంతరాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది. రాజమండ్రి నుంచి మధ్యప్రదేశ్కు వెళ్తున్న ట్యాంకర్ లారీ ఆపి తనిఖీ చేశారు. వాహనం ట్యాంకర్ మధ్య భాగంలో ప్రత్యేకంగా తయారు చేసిన అరల్లో 290 కేజీల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.72.50 లక్షలు. గంజాయితో, ట్యాంకర్ను స్వాధీనం చేసుకున్నారు.