ధర్మయుద్ధ మహాసభను విజయవంతం చేయాలి
NEWS Oct 31,2024 05:45 pm
భీంగల్: మాదిగల ఐక్యత కోసం భీంగల్ మండల కేంద్రంలో జరిగే మాదిగల ధర్మ యుద్ధ మహా సభను విజయవంతం చెయ్యాలని భీంగల్ మండల కేంద్రానికి వచ్చిన MRPS నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు కనక ప్రమోద్ మాదిగ, MEF జాతీయ నాయకులు తెడ్డు గంగారాం మాదిగ పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో భీంగల్ మండల కేంద్రంలో మాదిగల ధర్మ యుద్ధ మహా సభను నిర్వహించాలని తీర్మానించామని 2-3 రోజులలో మీటింగ్ తేది నిర్ణయిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో భీంగల్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.