కొండగట్టు దేవస్థానంలో దీపావళి వేడుకలు
NEWS Oct 31,2024 04:52 pm
మల్యాల: ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు దేవస్థానంలో ప్రత్యేక దీపాలంకరణ చేసి, ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, అధికారులు, సిబ్బంది, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.