మెట్పల్లి కూరగాయల మార్కెట్లో ఆవులు బీభత్సం సృష్టించాయి. 15 నిమిషాలు పాటు ఆవుల కొట్లాటలో ఒకరి తలకు గాయాలు అయ్యాయి. బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. పార్కింగ్లో ఉన్న ద్విచక్రవాహనాలు కూడా ధ్వంసం అయ్యాయి. ముఖ్యంగా కూరగాయలు రోడ్డుపై విక్రయించి, మిగిలిన వాటిని రోడ్డుపైనే వేయడంలో ఆవులు సంచరిస్తున్నాయని, మున్సిపల్ వారు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.