ఇందిరాగాంధీ 39వ వర్ధంతి వేడుకలు
NEWS Oct 31,2024 01:21 pm
మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి వేడుకలను కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కోరుట్ల పట్టణ భవన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు పాల్గొని ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొంతం రాజం, కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.