విద్యుత్ అంశాలపై మంత్రి సమీక్ష
NEWS Oct 31,2024 01:03 pm
నల్గొండ: రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటినుంచే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ట్రాన్స్-కో అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన నల్గొండలోని తన క్యాంపు కార్యాలయంలో ఎస్పీడీసీఎల్ పర్యవేక్షక ఇంజనీర్ వెంకటేశ్వర్లు, ఇతర విద్యుత్తు అధికారులతో విద్యుత్ అంశాలపై సమీక్ష నిర్వహించారు.