జగిత్యాల: ఇందిరాగాంధీ వర్ధంతి వేడుకలు
NEWS Oct 31,2024 11:51 am
మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి సందర్బంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నివాసం ఇందిరా భవన్లో నివాళి అర్పించారు. అనంతరం పాత బస్టాండ్ కూడలిలో ఇందిరా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి, దేశానికి ఆమె చేసిన సేవలను కొనియాడారు. దేశంలో తొలి మహిళా ప్రధానిగా దేశం కోసం సర్వస్వం ధారపోసిన మహనీయురాలు ఇందిరాగాంధీ అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.