ఇందిరా సేవలు చిరస్మరణీయం: జువ్వాడి
NEWS Oct 31,2024 07:32 am
మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జువ్వాడి కృష్ణారావు నివాళులర్పించారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి మెట్పల్లిలో ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కృష్ణారావు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో అనేక సంస్కరణలు చేసి ప్రజాహిత నిర్ణయాలు తీసుకొని దేశ ప్రజలకు అమ్మగా ఇందిరా సేవలు చిరస్మరణీయమన్నారు.