పర్యావరణ పరిరక్షణకు మట్టి ప్రమిదలు
NEWS Oct 30,2024 05:31 pm
దీపావళి పర్వదినానికి పర్యావరణ పరిరక్షణకై మట్టి దీపాలను వాడాలని మున్సిపల్ కమిషనర్ మోహన్ అన్నారు. మెట్పల్లి పట్టణంలో బుధవారం స్వచ్ఛ దివాలి శుభ్ దివాలి కార్యక్రమాన్ని నిర్వహించారు. మట్టి ప్రమిదల్లో వెలిగించి దీపావళిని జరుపుకోవాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ ప్రవీణ్ కుమార్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ విష్ణు, ముజీబ్, అశోక్, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.