బదిలీ వెళ్లిన ఉపాధ్యాయులకు సన్మానం
NEWS Oct 30,2024 05:55 pm
వేల్పూర్ మండలం పడగల్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులు జమాలుద్దీన్, మల్లేష్, ప్రశాంత్, శ్యామల టీచర్స్ కి వీడుకొలు సన్మానం చేయగా, అలాగే కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులను తోటి ఉపాధ్యయులు స్వాగత సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో
ప్రధానోపాధ్యాయురాలు సరోజినీ, ఉపాధ్యాయులు శంకర్, రాకేష్ కుమార్, నాగరాజ్, ప్రవీణ్, అజయ్, స్కూల్ విద్యార్థులు, గ్రామ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.