సంగారెడ్డిలో పోలీసు యాక్ట్: జిల్లా ఎస్పీ
NEWS Oct 30,2024 01:52 pm
సంగారెడ్డి జిల్లాలో నవంబర్ 1నుంచి 30వ తేదీ వరకు నెల రోజుల పాటు పోలీసు చట్టం అమలులో ఉంటుందని జిల్లా జిల్లా ఎస్పీ రూపేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, ర్యాలీలు, సభలు, సమావేశాలు, ఆందోళన కార్యక్రమాలను నిర్వహించ కూడదని సూచించారు. ఒక వేళ అనుమతి లేకుండా ఎవరైన ఉల్లంగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.