‘డిజిటల్ అరెస్ట్’.. రూ.72 లక్షలు గోవిందా
NEWS Oct 30,2024 09:55 am
అనంతపురం జిల్లా గుత్తిలోని చంద్రప్రియ నగర్ వాసి మహమ్మద్ వలీ రైల్వే గార్డ్. 4 రోజుల క్రితం ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులమని చెప్పి మహమ్మద్ వలీకి సైబర్ నేరగాళ్లు వీడియో కాల్ చేశారు. ముంబై బాంబు బ్లాస్ట్ ఘటనలో మీ పేరు ఉందని వలీని సైబర్ నేరగాళ్లు బెదిరించారు. వెంటనే అరెస్టు చేయోద్దంటే కొంత డబ్బు పంపాలని బెదిరించారు. పలు దపాలుగా మహమ్మద్ వలి నుంచి రూ. 72లక్షల సొమ్మును సైబర్ నేరగాళ్లు కొట్టేశారు. బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.