మంత్రివర్గంలో గిరిజనులకు అన్యాయం: జైపాల్
NEWS Oct 30,2024 06:20 pm
గిరిజనులకు ప్రభుత్వం వెంటనే మంత్రి వర్గంలో చోటు కేటాయించాలని ఉమ్మడి మెదక్ జిల్లా గిరిజన సంక్షేమ సంఘం అధ్యక్షులు జైపాల్ నాయక్ డిమాండ్ చేసారు. ప్రభుత్వం ఏర్పాడి 9 నెలలు గడిచిపోయినా గిరిజనులకు మంత్రి పదవి కేటాయించకపోవడం సరికాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడానికి గిరిజనులు కీలక పాత్ర పోషించారని, తెలంగాణ రాష్ట్రంలో 12 శాతం గిరిజనులు ఉన్నా ఇప్పటివరకు మంత్రివర్గంలో అవకాశం ఇవ్వకపోవడంపై అయన మండిపడ్డారు.