పోలీసులు అదుపులో 8 ఇసుక ట్రాక్టర్లు
NEWS Oct 30,2024 01:35 pm
కమలాపురం: కమలాపురం పాపాగ్ని నది బ్రిడ్జి వద్ద అక్రమంగా ఇసుక తరలిస్తున్న 8 ట్రాక్టర్లను బుధవారం కమలాపురం సిఐ రోషన్, ఎస్ఐ ప్రతాప్ రెడ్డి పట్టుకున్నారు. ఈ సందర్భంగా పాపాగ్ని నది వద్ద నుంచి ట్రాక్టర్లను స్టేషన్ కు తరలించారు. పట్టుబడిన ట్రాక్టర్లు కాజీపేట మండలానికి చెందినవిగా గుర్తించారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.