సమగ్ర కుటుంబ సర్వేపై శిక్షణ తరగతులు
NEWS Oct 30,2024 10:02 am
మల్లాపూర్ మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం సమగ్ర కుటుంబ సర్వే ను పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ పేర్కొన్నారు. కార్యదర్శులు, సర్వే ఎన్యూమరేటర్లకు శిక్షణ తరగతుల కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. 150 కుటుంబాలకు ఒక ఎన్యూమరేటర్లను నియమిస్తామన్నారు. ఎన్యూమరేటర్లకు తమకు కేటాయించిన కుటుంబాలను పగడ్బందీగా సర్వే చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీపీవో రఘువరన్ ఉన్నారు.