భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు
NEWS Oct 30,2024 05:01 am
చిన్నమండెం: వైఎస్సార్ కడప జిల్లాలో భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చెప్పారు. బుధవారం చిన్నమండెం మండలం బోరెడ్డిగారిపల్లెలోని తమ నివాసం నందు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. గతంలో అన్నమయ్య జిల్లాలో అనేక భూ ఆక్రమణంలో జరిగాయని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భూ సమస్యలు పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు.