సమస్యలు పరిష్కరించాలని MLAకు వినతి
NEWS Oct 30,2024 04:30 am
ప్రొద్దుటూరు మండలంలోని కొత్తపల్లి గ్రామపంచాయతీ ఎర్రబెల్లి కాలనీకి చెందిన పలువురు బుధవారం ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డిని కలిశారు. ఈ సందర్బంగా ఎర్రబెల్లి కాలనీలో పలు సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యేకు విన్నవించారు. అనంతరం ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పంచాయితీ వార్డు సభ్యులు షబ్బీర్, ముక్తియార్, అమిర్ తదితరులు పాల్గొన్నారు.