నీళ్లు రాక టేక్మాల్ ప్రజల ఇక్కట్లు
NEWS Oct 30,2024 04:33 am
టేక్మాల్ మండల కేంద్రంలోని ప్రజలకు తాగు నీటి కష్టాలు ఎదురయ్యాయి. 2 రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని, మరమ్మతుల పేరుతొ ప్రజలను అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని గ్రామ ప్రజలు తెలిపారు. దీంతో తాగడానికి, ఇతర అవసరాలకు నీళ్లు లేవని ఈ సందర్బంగా గ్రామం ప్రజలు వాపోయారు. ఇప్పటికైనా సంబంధించిన మిషన్ భగీరథ అధికారులు స్పందించి మిషన్ భగీరథ నీళ్లు గ్రామానికి వచ్చేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.