సుదూర ప్రాంతాలకు వేగంగా రవాణా చేసేందుకు డ్రోన్లు వచ్చేశాయి. సామాన్యులకూ ఉపకరించేలా రూపొందించిందే.. బ్లూజే ఎయిర్క్రాఫ్ట్. హైదరాబాద్కు చెందిన బ్లూజే ఏరో సంస్థ తాజాగా లాజిస్టిక్స్ కోసం ఉపయోగించే మానవరహిత వీటీవోఎల్ ఎయిర్క్రాఫ్ట్ ’రీచ్’ను లైవ్లో ప్రదర్శించారు. ఇది దేశీయంగా రూపొందించిన తొలి హైడ్రోజన్–ఎలక్ట్రిక్ VTOVL అని సంస్థ సహ వ్యవస్థాపకుడు ఉత్తమ్ కుమార్ తెలిపారు. ఒక్కసారి చార్జ్ చేస్తే 300 కి.మీ. 100 కేజీలను తీసుకెళ్లగలదని చెప్పారు.