పడగల్లో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం
NEWS Oct 29,2024 04:43 pm
నిజామాబాద్ జిల్లా, వేల్పూర్ మండలంలోని పడగల్ గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సభ్యుల ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాన్ని పిఎసిఎస్ చైర్మన్ యల్లా హనుమంత రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు వరి కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు సహకార సంఘ సభ్యులు పాల్గొన్నారు.