ఆర్మూర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్గా సాయిబాబాగౌడ్
NEWS Oct 29,2024 04:31 pm
ఆర్మూర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్గా నియమితులైన సాయిబాబా గౌడ్కు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నియామకపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సాయిబాబా గౌడ్ మాట్లాడుతూ.. తనకు మార్కెట్ కమిటీ ఛైర్మన్గా బాధ్యతలు అప్పగించిన సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు. ఇందుకు సహకరించిన, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ ఛైర్మన్ మానాల మోహన్ రెడ్డి, ఆర్మూర్ నియోజకవర్గ బాధ్యులు వినయ్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు.