కడప: పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ లను విడుదల చేయాలి
NEWS Oct 29,2024 04:46 pm
కడప: డిగ్రీ, ఇంజనీరింగ్, బి-ఫార్మసీ వంటి ఉన్నతమైన విద్యలో పెండింగ్లో ఉన్న 3,480 కోట్ల రూపాయలు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఎ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎద్దు రాహూల్, వీరపోగు రవి కోరారు. ఈ సందర్భంగా కడప తహసిల్దార్ లక్ష్మీనారాయణ రెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఎ నాయకులు పాల్గొన్నారు.