మద్యం షాపులపై చర్యలు తీసుకోవాలి
NEWS Oct 29,2024 04:10 pm
సేవాలాల్ సేన జిల్లా కమిటీ జిల్లా అధ్యక్షులు ధరావత్ సురేష్ నాయక్ ఆధ్వర్యంలో ఇల్లందు ఎక్సైజ్ సిఐ ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు మద్యాన్ని విక్రయిస్తున్న వైన్ షాప్ సిండికేట్ బెల్ట్ షాపులపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రాన్ని అందజేశారు. భద్రాద్రి జిల్లా ఎక్సైజ్ శాఖ పరిధిలోని మండలాలలో మద్యం అమ్మకాలు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా విచ్చలవిడిగా విక్రయాలు కొనసాగుతున్నాయని, ఇకనైనా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.