గుర్రంకొండ ఆంజనేయస్వామి ఆలయంలో చోరీ
NEWS Oct 29,2024 04:44 pm
గుర్రంకొండలోని ఆంజనేయస్వామి ఆలయంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఆలయం తలుపులు పగలకొట్టి ఆలయంలోని ప్రవేశించి ఆలయంలోని బీరువా పగలగొట్టి వెండి ఆభరణాలు, నగదు చోరీ చేశారు. చోరీ జరిగిన విషయం గమనించిన ఆలయ పూజారి మహేష్ స్వామి గుర్రంకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుర్రంకొండ సబ్ ఇన్స్పెక్టర్ మధు రామచంద్రుడు సంఘటనా స్థలానికి వెళ్లి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.