విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించిన ప్రిన్సిపాల్
NEWS Oct 29,2024 04:45 pm
పీలేరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారం విద్యార్థుల తల్లిదండ్రులకు అపార్ ఐడి పై కళాశాల ప్రిన్సిపాల్ వెంకటరెడ్డి అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులతో ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండే విధంగా తల్లిదండ్రులు విద్యార్థులను గమనిస్తూ ఉండాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.