చంద్రబాబును కలిసిన కపిల్ దేవ్
NEWS Oct 29,2024 12:33 pm
ఉండవల్లి: క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ సీఎం చంద్రబాబును కలిశారు. విజయవాడ వచ్చిన కపిల్ దేవ్.. స్థానిక ఎంపీ, ఆంధ్రా క్రికెట్ సంఘం అధ్యక్షుడు కేశినేని చిన్నితో కలిసి ఉండవల్లిలో సీఎంతో భేటీ అయ్యారు. అమరావతిలో గోల్ఫ్ కోర్స్, క్లబ్ ఏర్పాటుపై చర్చించారు. అమరావతిలో గోల్ఫ్ కోర్స్ ఏర్పాటు చేస్తే రాజధానికి అదనపు ఆభరణం అవుతుందని చంద్రబాబు భావిస్తున్నారు.