ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు కావాలి
NEWS Oct 29,2024 11:31 am
రైల్వే కోడూరు: ఆటో డ్రైవర్లు సంక్షేమం కోసం ప్రభుత్వం పని చేయాలని సిఐటియు అన్నమయ్య జిల్లా అధ్యక్షులు సిహెచ్ చంద్రశేఖర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం రైల్వే కోడూరు మార్కెట్ యార్డ్ వద్ద ఆటో ట్రాలీ డ్రైవర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రైవర్ల సంక్షేమం కోసం కేరళ రాష్ట్రంలో మాదిరిగా సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.