అక్టోబర్ 31న AITUC ఆవిర్భావ దినోత్సవం
NEWS Oct 29,2024 12:17 pm
ఏఐటీయూసీ ఆవిర్భావ దినోత్సవం అక్టోబర్ 31న వైభవంగా నిర్వహించాలని ఏఐటీయూసీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు తుమ్మల రాధాకృష్ణ కోరారు. రైల్వే కోడూరు లోని సిపిఐ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. కార్మికుల హక్కుల రక్షణ కొరకు, కార్మికుల జీవన ప్రమాణాల మెరుగు కొరకు ఏఐటీయూసీ నిరంతరం అలుపెరుగని పోరాటాలు నిర్వహించిందని తెలిపారు. కార్యక్రమంలో మాదరాజు గంగాధర్, పోకూరు మురళి, నందలూరు సరోజినమ్మ, తుమ్మల కృష్ణ చైతన్య పాల్గొన్నారు.