మెట్పల్లి: 7 అంశాలకు ఏకగ్రీవ ఆమోదం
NEWS Oct 29,2024 08:29 am
మెట్పల్లి పాలక సంఘం సాధారణ సమావేశంలో ప్రవేశ పెట్టిన 7 అంశాలు సభ్యులందరూ అంశాల వారిగా చర్చించి ఏకగ్రీవంగా ఆమోదించారు. చైర్పర్సన్ రణవేణి సుజాత అధ్యక్షతన కౌన్సిల్ ప్రవేశ పెట్టిన అన్ని అంశాలను వైస్ చైర్మన్ చంద్రశేఖర్ రావుతో సహా గౌరవ కౌన్సిల్ సభ్యులు ఆమోదించారు. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికురాలు విధి నిర్వహణలో రిటైర్మెంట్ అయిన వేంగంటి రంగుకి మున్సిపల్ కార్మికులు ఘనంగా సన్మానించారు. అలాగే మున్సిపల్ పాలక వర్గం, అధికారులు సన్మానించి వీడ్కోలు పలికారు.