డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి
NEWS Oct 29,2024 08:36 am
రాయచోటి: వైద్యులు రోగులకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. రాయచోటిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నూతన డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించారు. జిల్లాలో డయాలసిస్ రోగుల సమస్యను పరిష్కరించడం కొరకు ప్రతిరోజు 100 మందికి డయాలసిస్ చేసే విధంగా ఆసుపత్రిని అభివృద్ధి పరిచామని ఆయన తెలిపారు. డయాలసిస్ రోగులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు