RTC బస్సులో అస్వస్థకు గురైన మహిళ
NEWS Oct 29,2024 05:16 am
ఆర్టీసీ బస్సులో అస్వస్థకు గురైన మహిళను 108 సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ నుండి నిజామాబాద్ వెళ్తున్న ఒక ఆర్టీసీ బస్సులో రామాయంపేట వద్దకు రాగానే ప్రయాణికురాలు 108 సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో రామాయంపేట బస్టాండ్లో ఆగి ఉన్న బస్సు నుండి మహిళను 108 సిబ్బంది శ్రీనివాస్, ఆసిఫ్ ఆసుపత్రికి తరలించారు. మహిళ ఆరోగ్యం నిలకడ గా ఉందని వారు తెలిపారు. సకాలంలో 108 సిబ్బంది మహిళలు ఆసుపత్రికి చేర్చడంపై స్థానికులు అభినందించారు.