నేడు కడప జిల్లాకు వైఎస్ జగన్
NEWS Oct 29,2024 05:13 am
వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. బెంగళూరు నుంచి హెలికాప్టర్ ద్వారా ఇడుపులపాయకు చేరుకున్నారు. అనంతరం రోడ్డు మార్గంలో పులివెందుల చేరుకుని ఆయన నివాసంలో కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు. జగన్ పర్యటన నేపథ్యంలో భద్రతను కట్టిదిట్టం చేశారు. 3 రోజుల పాటు జగన్ జిల్లాలో పర్యటిస్తారని పార్టీ నాయకులు తెలిపారు.