11 లోపు 10వ తరగతి పరీక్ష ఫీజు చెల్లించాలి
NEWS Oct 29,2024 05:09 am
పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు రాయడానికి నవంబర్ 11వ తేదీ లోపు పరీక్ష ఫీజు చెల్లించాలని చిట్వేలు మండల విద్యాశాఖ అధికారి కోదండ నాయుడు తెలిపారు. చిట్వేలులో ఆయన మాట్లాడుతూ.. రెగ్యులర్ విద్యార్థులు పాఠశాల ప్రధానోపాధ్యాయుల ద్వారా రూ. 125 రుసుము చెల్లించాలని తెలిపారు. నవంబర్ 12 నుంచి 18 లోపు చెల్లిస్తే రూ. 50, 19 నుండి 25 వరకు రూ. 200, 26 నుండి 30 వరకు రూ. 500 అదనంగా చెల్లించాల్సి ఉంటుందన్నారు.