కృష్ణపట్నం రైల్వే లైన్ లో రైళ్లు నడపాలి
NEWS Oct 29,2024 05:07 am
ఓబులవారిపల్లి నుండి కృష్ణపట్నం వెళుతున్న రైల్వే మార్గంలో 10 సంవత్సరాల నుండి గూడ్స్ రైళ్లు మాత్రమే వెళుతున్నాయని ఆ దారిలో ప్యాసింజర్ రైళ్లు నడపాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సమితి సభ్యులు మలిశెట్టి రాహుల్ కోరారు. మంగళవారం చిట్వేలి లో ఆయన మాట్లాడుతూ రాజధాని అమరావతి కి వెళ్లడానికి ప్రజలకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి అధికారులు ఆలోచించి ప్యాసింజర్ రైళ్లు నడపాలని ఆయన కోరారు.