సైనికుడిపై దాడి చేసిన వ్యక్తులను
కఠినంగా శిక్షించాలి
NEWS Oct 29,2024 03:40 am
బోయకొండలో గాలివీడుకు చెందిన సైనికుడు సురేష్ రెడ్డి పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని మాజీ సైనికుల సంఘం మదనపల్లి అధ్యక్షుడు కంచర్ల శ్రీనివాసులు నాయుడు డిమాండ్ చేశారు. మంగళవారం మదనపల్లిలో ఆయన మాట్లాడుతూ.. సైనికుడు సురేష్ రెడ్డి లడ్డాక్ వద్ద 15 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నాడని తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.