సత్య నాదెళ్లతో నారా లోకేశ్ భేటీ
NEWS Oct 29,2024 02:57 am
మైక్రో సాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లతో మంత్రి నారా లోకేశ్ రెడ్మండ్లోని సంస్థ కార్యాలయంలో సమావేశమయ్యారు. క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డేటా సెంటర్ల ఏర్పాటుతో ఏపీ ప్రపంచస్థాయి సంస్థలకు ప్రాంతీయ కేంద్రంగా మారే అవకాశాలు ఉన్నాయని, పెట్టుబడులకు అనుకూలమైన విధానాలు, భూమి తమ వద్ద అందుబాటులో ఉన్నాయని తెలిపారు. క్లౌడ్ సేవల్లో మైక్రోసాఫ్ట్ నాయకత్వంతో కలిసి మేము అత్యాధునిక సాంకేతిక పర్యావరణ వ్యవస్థ కోసం సహకరించాల్సిందిగా సత్య నాదేళ్లకు లోకేశ్ విజ్ఞప్తి చేశారు.