గంగారెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి
NEWS Oct 28,2024 04:36 pm
జగిత్యాల: ఇటీవల హత్యకు గురైన జగిత్యాల రూరల్ మండలంకు చెందిన కాంగ్రెస్ నాయకుడు మారు గంగారెడ్డి కుటుంబాన్ని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పరామర్శించారు. ఈ సందర్భంగా గంగారెడ్డి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ లక్ష్మణ్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ ఠాకూర్ పాల్గొన్నారు.