వక్ఫ్ బోర్డు ఆస్తులు కాపాడండి
NEWS Oct 28,2024 01:57 pm
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే నూతన వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుతో వక్ఫ్ బోర్డు ఆస్తులకు మరింత నష్టం జరిగే అవకాశం ఉన్నందున తక్షణమే ఆలోచన విరామించుకోవాలని ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు అల్తాఫ్ రజా కోరారు. సోమవారం మైనారిటీ వ్యవహారాల శాఖ కమిషనర్ చిట్టూరి శ్రీధర్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుతో ఆస్తులకు మరింత నష్టం జరిగే అవకాశం ఉందని, దీనిపై ప్రభుత్వ పెద్దలకు సమగ్ర నివేదిక ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.