లాయర్స్ యూనియన్ కొత్త కమిటీ
NEWS Oct 28,2024 01:51 pm
ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ రాష్ట్ర మహిళా కన్వినింగ్ కమిటీకి సభ్యులుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి జి.కె.అన్నపూర్ణ, జి.సునంద ఎన్నికయ్యారు. 2 రోజుల పాటు ఖమ్మంలో జరిగిన మహిళా న్యాయవాదుల రాష్ట్ర కన్వెన్షన్ ముగింపులో కొత్త కమిటీని ఎన్నుకున్నారు. చందాల శైలజ కన్వీనర్గా, మోత్కురి వనజ, ఎల్లావుల మంజులత, కె.రామలక్ష్మీ కో-కన్వీనర్లుగా ఎన్నికయ్యారు. హైకోర్టు న్యాయమూర్తి పి.శ్రీ సుధ, సీనియర్ జర్నలిస్టు సి. వనజ, AILUరాష్ట్ర అధ్యక్షులు కొల్లి సత్యన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.